యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మి నారసింహుడి తిరుకల్యాణోత్సవం(Kalyanotsavam )శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హవనం జరిపారు. స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి విశ్వక్సేనారాధన, స్వస్తీవాచనం కార్యక్రమాలతో కల్యాణాన్ని నిర్వహించారు. సహస్రనామార్చనలు, నిత్యారాధనలు, సువర్ణపుష్పార్చనలో భక్తులు (Devotees)పాల్గొన్నారు.
సాయంత్రం స్వామివారిని గరుఢవాహనం, అమ్మవారిని తిరుచ్చివాహనంపై ఊరేగించారు. ఆలయ ముఖ మండపంలో సువర్ణమూర్తులకు దర్బార్ సేవ చేపట్టారు. ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని 12 వేల మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ ఈవో(Temple EO) ఎన్ గీత తెలిపారు. స్వామివారి ఖజానాకు రూ.17,29,300 ఆదాయం(Income) సమకూరిందని ఆమె వెల్లడించారు.