యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయంలో ఆళ్వార్ దివ్యప్రబంధ అధ్యయన మహోత్సవాలు శాస్ర్తోక్తంగా కొనసాగుతున్నాయి. అధ్యయనోత్సవాల్లో రెండో రోజు ఆదివారం స్వామివారికి ప్రభాత వేళ తిరుప్పావై మహోత్సవం, నవ కలశాభిషేకం, మూలమంత్ర హోమం నిర్వహించారు.
ఉదయం స్వామివారిని వేణుగోపాలస్వామి, సాయంత్రం గోవర్ధనగిరిధారిగా అలంకరించి పురప్పాట్ సేవలను చేపట్టి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
– యాదగిరిగుట్ట