యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి(Sri Laxmi Narasimha Swamy) ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. దేవస్థానానికి వివిధ రూపేణా రూ. 69,69,250 ఆదాయం(Income) వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు.ప్రధాన బుకింగ్ (Main booking) ద్వారా రూ. 6,67,600, కైంకర్యముల ద్వారా రూ. 3,600, సుప్రభాతం ద్వారా రూ.10,400, పుష్కరిణీ ద్వారా రూ.1,600, వ్రతాల ద్వారా రూ.1,53,600 ఆదాయం సమకూరిందని తెలిపారు.
ప్రచార శాఖ ద్వారా రూ. 24,190, వీఐపీ దర్శనం ద్వారా రూ. 3,00,000, యాదరుషి నిలయము ద్వారా రూ.1,34,334, ప్రసాదవిక్రయం ద్వారా రూ.18,32,700 , పాతగుట్ట ద్వారా రూ. 64,990, కళ్యాణ కట్ట ద్వారా రూ. 1,47,500 ఆలయానికి ఆదాయం వచ్చిందన్నారు .
వాహన పూజల ద్వారా రూ. 23,100, కొండపైకి వాహన ప్రవేశాల ద్వారా రూ. 5,50,000, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 1,16,232 ఆదాయం సమకూరిందని తెలిపారు.శివాలయం ద్వారా రూ.10,000, అన్నదానము ద్వారా రూ.17,309, బ్రేక్ దర్శనం ద్వారా రూ. 5,20,200, క్లాక్ రూమ్ మొబైల్ కౌంటర్ ద్వారా రూ. 41,895, లీగల్, లీజేస్ ద్వారా రూ. 23,50,000 ఆదాయం సమకూరిందని వివరించారు.