యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్ట(Yadagirigutta) లక్ష్మీ నరసింహ స్వామి(Lakshmi Narasimha Swamy) వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు( Brahmotsavalu) వైభవంగా కొనసాగుతున్నాయి. కాగా, నేటితో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. గురువారం ఉదయం స్వామి వారికి అష్టోత్తర శతఘటాభిషేకాన్ని నిర్వహించారు. నేటి రాత్రి డోలోత్సవం నిర్వహించి ఉత్సవాలకు ఆలయ అధికారులు పరిసమాప్తి పలకనున్నారు.