యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బాలాలయంలో నిత్యపూజలు ఉదయం 4 గంటల నుంచి ప్రారంభమయ్యా యి. సుప్రభాత సేవ మొదలుకుని నిజా భిషేకం వరకు కోలాహలంగా పూజలు కొనసాగాయి. శ్రీవారి నిత్యకల్యాణం నిర్వ హించారు. నిత్య పూజల్లో భాగంగా బాలాలయ మండపంలో లక్ష్మీనరసింహుల నిత్యకల్యాణం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. తొలుత సుదర్శన నారసింహహోమం నిర్వహించారు.
మహా మండపంలో అష్టోత్తరం నిర్వహించారు. సాయంత్రం వేళ అలంకార జోడు సేవోత్సవాన్ని సంప్రదాయంగా నిర్వహించా రు. అలంకార సేవోత్సవంలో పాల్గొన్న భక్తులకు శ్రీస్వామి అమ్మవారుల ఆశీస్సులు అందజేశారు. శ్రావణమాసం సంద ర్భంగా వ్రతాలు భారీగా జరిగాయి. సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తుల పాల్గొని వ్రతమాచరించారు. పాతగుట్టలో లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య పూజలు ఆలయ సంప్రదాయ రీతిలో కొనసాగాయి.