యాదాద్రి: యాదాద్రి స్వామి వారికి నిజాభిషేకం అత్యంత వైభవంగా కొనసాగాయి. తెల్లవారు జాము మూడు గంటల నుంచి ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపారు. ఉదయం మూడు గం టలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీ నరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేసి హారతి నివేదనలు అర్పించారు.
ఉదయం 8 గంటలకు నిర్వహించిన సుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. ప్రతిరోజూ నిర్వహించే నిత్య తిరుకల్యాణోత్సంలో భక్తులు పాల్గొన్నారు. శ్రావణ మాసం పురస్కరిం చుకుని సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొన్న భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
స్వామివారి ఆలయానికి పూలతో అలంకరణ..
శ్రావణమాసం సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయాన్ని వివిధ రకాల రంగుల పూలతో అలంక రించారు. హైదరాబాద్కు చెందిన భక్తుల సహకారంతో స్వామి వారి గర్భాలయం, అష్టోత్తర మండపం, కల్యాణ మండపా లతోపాటు బాలాలయ గోడలను రంగు రంగుల పూలతో తీర్చిదిద్దారు.