యాదగిరిగుట్ట, అక్టోబర్ 28 : పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా శనివారం సాయంత్రం 4 గంటలకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, అనుబంధ పాతగుట్ట ఆలయంతోపాటు పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయం, ఉపాలయాలను అర్చకులు, అధికారులు మూసివేశారు.
శనివారం అర్ధరాత్రి 1:05 గంటల నుంచి 2:22 గంటల వరకు ఖండగ్రాస (పాక్షిక) చంద్రగ్రహణం వేద కాలంలో ప్రారంభమవుతున్న నేపథ్యంలో సాయంత్రం తిరువారాధన, నివేదన, శయనోత్సవం నిర్వహించి స్వామివారి ఆలయ ద్వార బంధనం గావించారు. ఆదివారం ఉదయం ఏకకాలంలో పుష్కరిణి శుద్ధి, ఆలయ సంప్రోక్షణ గ్రహణ సంబంధ శుద్ధి పూర్తి చేసి, సుప్రభాతం కార్యక్రమాలతోపాటు స్వామి, అమ్మవార్ల నిత్యోత్సవాలను యథావిధిగా కొనసాగిస్తామని ఆలయ ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, ఈవో గీత తెలిపారు.