యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో వేగం పెంచి సకాలంలో పూర్తి చేయాలని ఈఎన్సీ రవీందర్రావు తెలిపారు. మంగళ వారం యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. మొదటగా స్వామి వారిని దర్శించుకున్న ఆయన ప్రధానాలయంతో పాటు క్యూలైన్లు, క్యూ కాంప్లెక్స్, లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రం, శివాల యం, శ్రీవారి మెట్ల నిర్మాణం, ఉత్తర భాగంలో కొనసాగుతున్న ప్రహరి, ఎస్కలేటర్ పనులను పరిశీలించారు.
కొండకింద వైకుంఠ ద్వారం వద్ద నిర్మిస్తున్న సర్కిల్, గిరి ప్రదక్షిణ రోడ్డు, కొండపైకి వెళ్లేందుకు నిర్మిస్తున్న ప్రత్యేక బ్రిడ్జి, గండి చెరువు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముఖ్యంగా ప్రధానాలయంతో పాటు శివాలయం, లడ్డూ ప్రసాద విక్ర యశాల, క్యూ కాంప్లెక్స్తో కొండపై పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాపై విద్యుత్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సమస్యలు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే ప్రధానాలయం, శివాలయం పనులు పూర్తయిన నేపథ్యంలో మిగతా పనులను పూర్తి చేయాలని అధికారులు సూ చించారు. ఆయన వెంట వైటీడీఏ ఎస్ఈ వసంతనాయక్, ఈఈ వెంకటేశ్వర్రెడ్డి, ఏడీఈఈ సునీల్కుమార్, విద్యుత్ ఎస్ఈ శ్రీనాథ్, డీఈ మల్లిఖార్జున్, వైటీడీఏ అధికారులు తదితరులు పాల్గొన్నారు.