జహీరాబాద్, ఏప్రిల్ 24: మంజీర గరుడగంగ కుంభమేళా ప్రారంభమైంది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని రాఘవపూర్, హుమ్నాపూర్ శివారులోని పంచవటి క్షేత్రం వద్ద సోమవారం జహీరాబాద్, నారాయణఖేడ్ ఎమ్మెల్యేలు మాణిక్రావు, భూపాల్రెడ్డి, కలెక్టర్ శరత్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, పంచవటి క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్ బాబా గంగామాతకు పూజలు చేసి కుంభమేళాను ప్రారంభించారు.
ఉత్తరాది నుంచి ప్రముఖ పీఠాధిపతులు, సాధు, సంతులు హాజరయ్యారు. మంజీరలో భక్తులు పుణ్యస్నానాలు చేసి పూజలు నిర్వహించారు. మహిళలు బోనాలతో ఊరేగింపు వచ్చి గంగామాతకు సమర్పించారు.