నారాయణరావుపేట, జనవరి 12 : గృహలక్ష్మి పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం వివిధ గ్రామాల మహిళలు బైఠాయించారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం గృహలక్ష్మి పథకం ద్వారా నిరుపేదల ఇండ్ల నిర్మాణానికి మంజూరు పత్రాలు ఇచ్చిందని అన్నారు.
తాము ఇప్పటికే ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించకున్నామని, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేస్తే తమ పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. పెండింగ్లో బిల్లులను వెంటనే చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చేతకాకపోతే గద్దె దిగిపోవాలన్నారు.