ఇచ్చోడ, జూన్ 29 : ‘మహిళలకు మహాలక్ష్మీ పథకం కింద రూ.2,500 ఎప్పుడిస్తావు సీఎం రేవంత్రెడ్డి’ అంటూ మహిళలు నిరసన తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే)లో సోమవారం వట సావిత్రీ పౌర్ణమి సందర్భంగా వట వృక్షానికి పూజలు చేస్తూ ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీల్లో భాగంగా ప్రతి మహిళకూ నెలకు రూ.2,500, పెండ్లి అయిన ఆడబిడ్డకు తులం బంగారం ఇస్తానని చెప్పి మూడేండ్లు అవుతున్న ఇంకా ఇస్తలేరని మండిపడ్డారు.
ఇచ్చిన హామీలు అమలు పరిచేలా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బుద్ధిని ప్రసాదించు దేవుడా అంటూ వట వృక్షానికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మీనాక్షి, ఇందూబాయి, కుసుమాబాయి, శారద, లక్ష్మి పాల్గొన్నారు.