హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాలు (ఎస్హెచ్జీ) స్ఫూర్తిదాయకమైన పాత్ర పోషిస్తున్నాయి. ఎస్హెచ్జీల ఏర్పాటు, నిర్వహణ తదితర అంశాలపై ఇతర రాష్ర్టాల మహిళలకు తెలంగాణ మహిళలు శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే పది బృందా లు లఢక్ వెళ్లి అక్కడి మహిళా సంఘాలకు శిక్షణ ఇచ్చాయి.
మహారాష్ట్రలో మరో 35 బృం దాలు శిక్షణ కొనసాగిస్తున్నాయి. తమ రాష్ర్టానికి వంద బృందాలను పంపించాలని యూపీ విజ్ఞప్తి చేసింది. త్వరలో ఛత్తీస్గఢ్కు 15 బృం దాలు, పంజాబ్కు మరికొన్ని బృందాలు వెళ్లనున్నాయి. శిక్షణ ఇచ్చేందుకు ఇతర రాష్ర్టాలకు వెళ్లే ఒక్కో బృందంలో ఏడుగురు సభ్యు లు ఉంటారు. వీరికి ఒక్కొక్కరికి సుమారు రూ.2 వేల చొప్పున రాష్ర్టాలు చెల్లిస్తాయి. నెల రోజులపాటు శిక్షణ ఇస్తే ఒక్కో సభ్యురాలికి 60 వేల వరకు ఆదాయం వస్తున్నది.
ఆయా రాష్ర్టాల్లోని మహిళలకు ఎస్హెచ్జీల ఏర్పా టు, సమావేశాలు, రికార్డుల నిర్వహణ, రు ణాలు తీసుకోవడం, వాటిని సద్వినియోగం చేసుకోవడం, అకౌంటింగ్ యాప్ వినియోగించడం తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నా రు. శిక్షణ కార్యక్రమాల నిర్వహణతో తెలంగాణ మహిళా సంఘాలకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. వారిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. అదనపు ఆదాయం లభిస్తున్నది. ఇతర భాషల్లో మాట్లాడే నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న మహిళా సంఘాల సభ్యులను శిక్షణ కార్యక్రమాలకు ఎంపిక చేస్తున్నారు.