సిద్దిపేట : కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ ధర(Cooking gas )ల పెంపుదలను నిరసిస్తూ సిద్దిపేటలో వినూత్న తరహాలో నిరసన తెలిపారు. ఒక్కో వంట గ్యాస్పై రూ. 50 పెంచడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ (BRS) ఆధ్వర్యంలో మహిళలు ‘కట్టెల పొయ్యి పై చాయ్ పెట్టి నిరసన తెలిపారు. కేంద్రం నిత్యవసర వస్తువుల ధరలను రోజురోజుకీ పెంచుతూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) రెండోసారి అధికారంలోకి వచ్చాక వంట గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని మండిపడ్డారు. పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మహిళలంతా ఏకమై తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.