15న జాతీయస్థాయి సమావేశం
భవిష్యత్తు కార్యాచరణ: ఆర్ కృష్ణయ్య
ముషీరాబాద్, ఫిబ్రవరి 7: పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. ఈ నెల 15న జాతీయస్థాయి బీసీ సం క్షేమ సంఘం జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించి దేశవ్యాప్తంగా బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నట్టు చెప్పారు. సోమవారం విద్యానగర్లోని బీసీభవన్లో నిర్వహించిన ఆ సంఘం కోర్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్లో 15న నిర్వహించే సమావేశంలో బీసీ సం ఘం, దాని అనుబంధ సంఘాల రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇందులో ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ల అమలు, పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టడం, బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ వంటి అంశాలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించనున్నట్టు చెప్పారు. ఈబీసీ విద్యార్థులకు పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్, విద్యార్థుల ఉపకార వేతనా ల పెంపు, బీసీ జనగణన చేపట్టాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. సమావేశంలో బీసీ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, లాల్ కృష్ణ, గుజ్జ సత్యం, సీ రాజేందర్, అనంతయ్య, బర్క కృష్ణయాదవ్, చంటి ముదిరాజ్, బబ్లుగౌడ్ పాల్గొన్నారు.