హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగా ణ): రాష్ట్రంలోని మైదాన ప్రాంతాల్లో ఐటీడీఏ ల ఏర్పాటు కోసం 2014లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 57ను ఇప్పటివరకు ఎందుకు అ మలు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. మై దాన ప్రాంతాల్లో ఐటీడీఏలను ఏర్పాటు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ లంబాడీ హకుల పోరాట సమితి తరఫున బానోతు శివ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ప్రధాన న్యాయమూ ర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్కుమార్ల ధర్మాసనం బుధవారం విచారణ జరిపిం ది.
మహబూబాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నిజామాబాద్, కామారెడ్డి, వికారాబాద్, నిర్మల్, జడ్చర్ల, జనగామ, యాదాద్రి భువనగిరి, పెద్దపల్లి జిల్లాల్లో గిరిజనులు అధికంగా ఉన్నా.. ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం సరైన సౌకర్యాలు కల్పించలేదని పిటిషనర్ తర ఫు న్యాయవాది వాదించారు. మైదాన ప్రాంతా ల్లో ఐటీడీఏలను ఏర్పాటు చేయాలని 2009 లో జారీ అయిన జీవో 30 కూడా అమలు కాలేదని తెలిపారు. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లకు నోటీసులు ఇచ్చిన ధర్మాసనం.. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.