హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): వన్యప్రాణుల రక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని అటవీశాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ఆదివారం ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓ ప్రకటన విడుదల చేశారు. జంతువులు, పక్షులు, వృక్షజాతుల రక్షణ కు అందరూ సంకల్పించాలన్నారు.