హైదరాబాద్ : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యేందుకు హైదరాబాద్కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి పలు అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నలు సంధించారు. ఇచ్చిన హామీలు ఏమయ్యాయో.. ఇక్కడి నుంచి వెళ్లేలోగా సమాధానం చెప్పాలని సవాలు విసిరారు. ఈ నేపథ్యంలో మస్ట్ ఆన్సర్ మోదీ అంటూ ట్విట్టర్ వేదికగా నెటిజన్లు వందలకొద్ది ప్రశ్నలు అడిగారు.
తాజాగా మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సైతం మోదీ మస్ట్ ఆన్సర్ ( #ModiMustAnswer ) హ్యాష్ట్యాగ్తో ట్వీట్ చేశారు. “మోదీజీకి నా సూటి ప్రశ్న, భారత రూపాయి పతనమవడానికి కారణం ఏంటి..? బీజేపీకి చెందిన ఉత్తరకుమారులు ఎవరి దగ్గరైన ఈ ప్రశ్నకు సమాధానం ఉందా..?” అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.
Modi Ji asking some pointed questions!
“Kya Kaaran Hain Hindustan Ka Rupayya Pathlaa Ho Raha Hain”?
Kisi BJP Ke Uttar Kumar ke paas Hain Uttar? #ModiMustAnswer pic.twitter.com/ags8Wk0P4c
— KTR (@KTRTRS) July 3, 2022