హైదరాబాద్: మూడు నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడంతో ఆర్థిక సమస్యలతో సూర్యాపేట జిల్లా దవాఖానలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి వసీం ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబం గడవక, భార్యా పిల్లలను ఎలా పోషించాలో తెలియక ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఎక్స్ వేదికగా స్పందించారు. వసీం బలవన్మరణానికి కారణమెవరని ప్రశ్నించారు.
ప్రతి నెల ఒకటో తేదీననే ఉద్యోగులకు జీతాలిస్తున్నట్లు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నది. అది పచ్చి అబద్ధమని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యానికి వసీం ఆత్మహత్యే ఉదాహరణ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. అతని ఆత్మహత్యకు కారణమెవరని నిలదీశారు.
వసీం తన భార్య రజనికి లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. ‘డియర్ రజని.. ముందు నువ్వు నన్ను క్షమించు. నిన్ను చాలా బాధపెట్టాను. పిల్లలు జాగ్రత్త. మనకు ఎవ్వరు లేరు. కానీ, మన పిల్లలు అలా కాకూడదు. నేను చాలాఆ ఊహలుకన్నాను. కానీ ఏదీ కుదరలేదు. వచ్చే జన్మ అని ఉంటే నా పిల్లలో ఎవరికైనా కొడుకుగా పుడతా. ఇంకొక్కటి రజనీ నీకు వీలైతే వీళ్లకు డబ్బులివ్వు. ఎక్కువేం చేయలే..’. అంటూ తాను ఎవరి వద్ద ఎంత డబ్బు తీసుకున్నాని ఆ లేఖలో వెల్లడించారు.
Congress Govt makes tall claims that they have been prompt in delivering salaries to all govt employees on the 1st of every month
An example of their absolute lies & utter failure is 👇
Wasim, an employee of Suryapet Govt Hospital has committed suicide as he has been… pic.twitter.com/gXxLX9iHBQ
— KTR (@KTRBRS) August 18, 2024