విమర్శిస్తే.. ఈడీ
ఎదురుతిరిగితే.. ఐటీ
విధానాలను ఎండగడితే.. సీబీఐ
అయినా దారికి రాలేదో.. ఈడీ+ఐటీ+సీబీఐ
కేంద్రంలోని బీజేపీ సర్కారు విపక్ష నేతలే లక్ష్యంగా గత పదేండ్ల నుంచి సాగిస్తున్న దమనకాండ ఇది.
రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయ పన్ను శాఖ (ఐటీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) లాంటి రాజ్యాంగ సంస్థలను కీలుబొమ్ములుగా మార్చుకొని మోదీ సర్కారు చేస్తున్న దురాగతాలు తారాస్థాయికి చేరాయి.
ఢిల్లీ మద్యం పాలసీలో అసలు కుంభకోణం ఎక్కడ ఉన్నది? అంటూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు గతంలోనే ఈడీని సూటిగా ప్రశ్నించి, మొట్టికాయలు కూడా వేసింది. తలా తోకా లేని ఈ కేసును పట్టుకొని శుక్రవారం ఈడీ అధికారులు బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసంలో సోదాలు నిర్వహించారు. ఒకవైపు సుప్రీంకోర్టులో కేసు నడుస్తుండగానే.. అవేమీ పట్టించుకోకుండా కవితను అరెస్టు చేశారు. దీన్ని రాజకీయ కక్షసాధింపుల్లో పరాకాష్ఠగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.
BJP | హైదరాబాద్, మార్చి 15 (స్పెషల్ టాస్క్ బ్యూరో-నమస్తే తెలంగాణ): ప్రతిపక్షాలను అణచివేసేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు చేస్తున్న దురాగతాలు నానాటికీ పెచ్చరిల్లుతున్నాయి. ఏదో ఓ ఆరోపణను తెరమీదకు తీసుకురావడం.. విపక్ష నేతలు, వారి సన్నిహితుల ఇండ్లల్లో సోదాలు జరుపడం.. వేధింపులకు గురిచేయడం.. ఇదీ గత పదేండ్ల నుంచి నరేంద్రమోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్నీతి. 2014లో ప్రధానిగా మోదీ గద్దెనెక్కినప్పటి నుంచి ఇప్పటివరకు ఈడీ, సీబీఐ, ఐటీ నమోదు చేసిన కేసుల్లో ప్రతిపక్ష నాయకులు, వారి సన్నిహితుల మీదే 95% ఫైల్ అయ్యాయి. వాటిలో కేవలం 0.46% కేసులు మాత్రమే రుజువయ్యాయి. మోత్తం కేసుల్లో కనీసం 0.5% కూడా రుజువు కాకపోవడాన్ని విశ్లేషిస్తే.. ప్రజాక్షేత్రంలో ప్రతిపక్ష నాయకులను దెబ్బతీసి, రాజకీయంగా కుంగదీసేందుకు మోదీ సర్కారు ఉద్దేశపూర్వకంగా ఈ కేసులను నమోదు చేస్తున్నట్టు అర్థమవుతున్నది. కేసులు, దర్యాప్తు సంస్థల విచారణను ఎదుర్కొన్న నేతలు.. బీజేపీలో చేరగానే సచ్చీలురైపోతున్నారు. దీంతో అప్పటివరకూ దూకుడుగా వ్యవహరించిన ఈడీ, ఐటీ, సీబీఐ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ హఠాత్తుగా కనిపించకుండా పోతున్నాయి.
1. నారాయణ్ రాణె: మనీలాండరింగ్ కేసులో ఈడీ వేటాడింది. 2017లో బీజేపీకి అను బంధంగా సొంత పార్టీ పెట్టుకోవడంతో దా డులు ఆగాయి. కేంద్ర మంత్రి పదవిని చేపట్టి 2019లో పార్టీని బీజేపీలో విలీనం చేశారు.
2. సువేందు అధికారి: పశ్చిమబెంగాల్కు చెందిన టీఎంసీ నేత. శారద మల్టీలెవల్ మార్కెటింగ్ కుంభకోణంలో 2014 నుంచి సీబీఐ పలుమార్లు ప్రశ్నించింది. 2020లో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటినుంచీ విచారణ బంద్.
3. హిమంత బిశ్వశర్మ: శారద కుంభకోణంలో నిందితుడు. 2014 నవంబర్లో సీబీఐ ఆయన ఇంటిలో సోదాలు జరిపింది. 2015 ఆగస్టులో బీజేపీలో చేరారు. ఏకంగా అస్సాం సీఎం అయ్యారు.
4. ముకుల్ రాయ్: 2014లో బెంగాల్లో లంచాలు తీసుకోవటంపై సంచలనం సృష్టిం చిన శారద కేసులో నిందితుడు. సీబీఐ పలు మార్లు నోటీసులు ఇవ్వడంతో 2017లో బీజే పీలో చేరారు. విచారణ ఆగింది. పైగా 20 21 మేలో ముకుల్రాయ్కి క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ వెంటనే మళ్లీ తృణమూల్లో చేరారు.
5. జ్యోతిరాదిత్య సింధియా: కాంగ్రెస్కు చెందిన జ్యోతిరాదిత్య సింధియాపై భూ ఆక్రమణ కేసులు నమోదయ్యాయి. 2020 మార్చి 10న ఆయన బీజేపీలో చేరగానే మధ్యప్రదేశ్ ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ ఆ కేసును మూసివేసింది.
6. భావన గవాలీ: మహారాష్ట్రలో ఠాక్రే శివసేనలో ఉన్నప్పుడు ఆమెకు ఈడీ ఐదుసార్లు నోటీసులిచ్చింది. ఇప్పుడు ఏక్నాథ్ షిండే వర్గం శివసేన (బీజేపీ మిత్రపక్షం) ఎంపీగా ఉన్నారు. పార్టీకి చీఫ్విప్గా కొనసాగుతున్నారు. ఈడీ కేసులు మరుగునపడ్డాయి.
7. యశ్వంత్ జాదవ్: యశ్వంత్ జాదవ్, ఆయన సతీమణి యామినీ జాదవ్పై ఫెమా ఉల్లంఘనల కింద ఈడీ కేసు లు పెట్టింది. షిండే వర్గంలో చేరగానే ఆ కేసులు అటకెక్కాయి.
8. ప్రతాప్ సర్నాయక్: శివసేనలో ఉన్న ప్పుడు మనీలాండరింగ్ ఆరోపణల తో ఈడీ కేసు నమోదు చేసింది. షిం డే సేనలోకి వెళ్లగానే కేసు ఊసే లేకుండా పోయింది.
9. సుజనా చౌదరి: టీడీపీకి చెందిన కేం ద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి ఇం డ్లు, కంపెనీల్లో 2018 నవంబర్లో ఈడీ, 2019 జూన్ 2న సీబీఐ సో దాలు నిర్వహించాయి. ఆయన ఢిల్లీ వెళ్లి జూన్ 20న బీజేపీలో చేరారు. ఆ తర్వాత దాడులు ఆగిపోయాయి.
10. సీఎం రమేశ్: టీడీపీకి చెందిన సీఎం రమేశ్పై 2018 అక్టోబర్లో ఐ టీ, 2019 ఏప్రిల్లో ఈడీ దాడులు జరిగాయి. ఆయన కూడా బీజేపీలో చేరాక దాడులు ఆగిపోయాయి.