నార్నూర్ : ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం పూనగూడకు చెందిన పెందోర్ విజ్జుబాయికి గురువారం పురిటి నొప్పులు వచ్చాయి. ఆశా కార్యకర్త అంజన్నబాయి 108, 102 (ఎమర్జెన్సీ, అమ్మ ఒడి) అంబులెన్స్ డ్రైవర్లకు ఫోన్ చేయగా అందుబాటులో లేమని చెప్పారు.
దీంతో ఆశా కార్యకర్త, అంగన్వాడీ టీచర్తోపాటు ఆదివాసీ సంఘాల నేతలు పెందోర్ తెలంగ్రావ్, కుడ్మెత దుర్గారావు, పెందోర్ చందు, దేవురావు, గ్రామస్థులు కలిసి ప్రైవేట్ ఆటోలో గర్భిణీని ఝరి దవాఖానకు తరలించారు.