BJP | హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): రెండు మూడు నెలలుగా బీజేపీ రాష్ట్ర నేత లు చేస్తున్న ఆరోపణలు ఇవి. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ‘రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు’ అంటూ బ హిరంగసభలో విమర్శించిన పరిస్థితి.‘ట్యాక్స్’ వసూలు ఆరోపణలను మొదట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ప్రారంభించగా.. బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి మరో స్థాయికి తీసుకెళ్లారు.
కే లక్ష్మణ్ వంటి కీలక నేతలు సైతం తరచూ ఇవే విమర్శలు చేస్తున్నారు. తెలంగాణలో సొమ్ము వసూలు చేసి.. ఢిల్లీకి సూట్కేసులు మోస్తున్నారంటూ పదేపదే చెప్తున్నారు. కాంగ్రెస్ తెలంగాణ డబ్బును దేశవ్యాప్తంగా ఎన్నికల ఖర్చుకోసం వాడుతున్నదంటూ మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కర్ణాటకలో కమీషన్లు వసూలు చేసి తెలంగాణ ఎన్నికల్లో వాడారని, ఇప్పుడు తెలంగాణలో వసూలు చేసి కర్ణాటకకు తరలిస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు.
ఆరోపణలు సరే.. చర్యలేవి?
బీజేపీ గల్లీ లీడర్లు మొదలు డిల్లీ నేతల దాకా కాంగ్రెస్పై ఆరోపణలు చేస్తున్నారు సరే.. ‘మరి చర్యలు ఏవి?’ అన్న ప్రశ్న ప్రజలందరిలో మెదులుతున్నది. ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలున్న చోట ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు స్వైరవిహారం చేస్తున్న విషయాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నా రు. అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రంలోని బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రతిఒక్కరూ ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్ర నేత లు కూడా ప్రతిరోజూ ఆరోపణలు చేయడమే తప్ప ఈడీకో, సీబీఐకో ఫిర్యాదు చేసిన దాఖలాలు కూడా లేవని చెప్తున్నారు. ఇవిగో ఆధారాలు.. అదిగో ఆధారాలు అంటూ రాజకీయంగా పబ్బం గడుపుకోవడం తప్ప, ఆ ఆధారాలతో ఎందుకు ఫిర్యాదు చేయడం లేదని నిలదీస్తున్నారు. ఇతర రాష్ర్టాల్లో చిన్న ఆరోపణలు, పాత కేసులను అడ్డం పెట్టుకొని ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగుతున్నాయని గుర్తు చేస్తున్నారు.
ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయని అంటున్నా రు. నిరుడు తమిళనాడులో ఇసుకను అక్రమంగా మైనింగ్ చేస్తున్నారంటూ ఈడీ అధికారులు దాడులు చేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. 2020 జూలైలో అశోక్ గెహ్లాట్ సీఎం గా ఉండగా ఆయన సోదరుడి ఇండ్లలో సోదా లు జరిపారని, 2007-09 మధ్య ఎరువుల ను పక్కదారి పట్టించారనే ఆరోపణలతో ఈ సోదాలు జరిగాయనంటున్నారు.
ఇలా చిన్నచిన్న కారణాలకే ఈడీ రంగంలోకి దిగుతుండగా.. రాష్ట్రంలో మూడునాలుగు రకాల కమీషన్లు వసూలు చేస్తుంటే ఎందుకు మిన్నకుండిపోయాయని అడుగుతున్నారు. ‘ఈడీ ఎక్క డ?.. సీబీఐ ఎందుకు రావడం లేదు?.. ఇతర దర్యాప్తు సంస్థలు ఎందుకు మౌనంగా ఉన్నాయి?’ అని ప్రశ్నిస్తున్నారు.
ప్రతిపక్షమైనా.. చర్యలెందుకు లేవు?
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేండ్లుగా ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టేందుకే ఈడీ, సీబీఐని వాడుతున్నదనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. పదేండ్లలో నమోదైన ఈడీ, సీబీఐ కేసుల్లో 97శాతం ప్రతిపక్ష నేతలు, వారి సన్నిహితులపై నమోదైనవేనని చెప్తున్నారు. అయి నా రాష్ట్రంలో ఎందుకు చర్యలు లేవని ప్రశ్నిస్తున్నారు. మోదీ ఆరోపించిన తర్వాత కూడా ఫిర్యాదో, దర్యాప్తో లేకపోవడాన్ని బట్టి రెండు పార్టీల మధ్య లోపాయకారీ ఒప్పందం జరిగినట్టు అనుమానపడాల్సి వస్తున్నదని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.