గీసుగొండ, సెప్టెంబర్ 13 : పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో జైలుకు వెళ్లి వచ్చిన చీటర్ అని, గతిలేక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని చేసిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. బుధవారం వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని పలు గ్రామాల్లో రూ.34.25 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం రైతులకు పంట నష్టపరిహారం చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ.. అధికారం కోసం రేవత్, ఆ పార్టీ నాయకులు అబద్ధాలు అడుతున్నట్టు తెలిపారు. రేవంత్కు వ్యవసాయంపై కనీస అవగాహన లేదని, రైతులకు మూడు గంటల కరెంటు చాలని అన్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
అధికారం కోసం రేవంత్, ఆ పార్టీ నాయకులు అబద్ధాలు అడుతున్నట్టు తెలిపారు. రేవంత్కు వ్యవసాయంపై కనీస అవగాహన లేదని, రైతులకు మూడు గంటల కరెంటు చాలని అన్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల కోసం పనిచేస్తున్నదని ఆరోపించారు. పేదల నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తున్న సొమ్మును వారికి పంచకుండా అంబానీ, అదానీలకు పంచుతున్నాడని విమర్శించారు. ప్రజలు బీజేపీ నేతల మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. గిరిజన రిజర్వేషన్ను 10 శాతం పెంచాలని తెలంగాణ ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపితే బీజేపీ ప్రభుత్వం అమోదించకుండా తొక్కిపెట్టిందని దుయ్యబట్టారు. దేశ ప్రజలకు మోదీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశం మొత్తం సీఎం కేసీఆర్ వైపే చూస్తున్నదని అన్నారు. దేశంలో రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్తును అందించే ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వమని పేర్కొన్నారు.