సిద్దిపేట: పోలీసుల సమక్షంలో ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం కాంగ్రెస్ మార్క్ పాలనకు నిదర్శనమని ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) అన్నారు. ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇంత దారుణంగా దాడి జరిగిందంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులే దుండగులను రక్షించడం మరింత సోచనీయమన్నారు. సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడిచేయడం పట్ల ఎక్స్ వేదికగా హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
‘సిద్దిపేట ఎమ్మెల్యే అధికారిక నివాసంపై అర్ధరాత్రి కాంగ్రెస్ గూండాలు దాడిచేసి.. తాళాలు పగులగొట్టి ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం దారుణం. ఈ దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులే దుండగులను రక్షించడం మరింత శోచనీయం. ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇంత దారుణంగా దాడి జరిగిందంటే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి?. పోలీసుల సమక్షంలో ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం కాంగ్రెస్ మార్క్ పాలనకు నిదర్శనం. వెంటనే ఈ ఘటనపై డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.’ అంటూ ట్వీట్ చేశారు.
Congress goons attack on the Siddipet MLA’s official residence at midnight is an alarming display of lawlessness. Breaking locks and vandalizing property in such manner is not only undemocratic but also raises serious concerns.
The police, rather than intervening to prevent this… pic.twitter.com/uvSABsumQu
— Harish Rao Thanneeru (@BRSHarish) August 17, 2024
కాగా, హరీశ్రావు క్యాంప్ ఆఫీస్పై కాంగ్రెస్ గూండాల దాడి నేపథ్యంలో.. బీఆర్ఎస్ కార్యర్తలు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల చర్యపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ నాయకులు క్యాంప్ ఆఫీస్కు వస్తుండంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు.