మహబూబాబాద్ : రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగుతోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తొర్రూర్ మండలం కొమ్మనపల్లి తండాలో రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని జిల్లా కలెక్టర్ శశాంకతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం దండుగలా మారిందన్నారు. రైతులు వ్యవసాయం చేయాలంటే అరిగోస పడ్డారు. రైతులు పంట పెట్టబడి కోసం దళారులను ఆశ్రయించేదన్నారు. కాగా, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో వ్యవసాయం పండుగలా మారిందన్నారు.
రాష్ట్రంలో సహకార రంగాన్ని అభివృద్ధి చేసి రైతాంగానికి సీఎం అండగా నిలిచారని ప్రశంసించారు. గత ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని విమర్శించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి, తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. దొడ్డు రకాల ధాన్యం కొనుగోలు చేయడంలో కేంద్రం నిర్లక్ష్యం చేస్తుంది.
రైతులు డిమాండ్ ఉన్న పంటలను పండించి లాభాలు పొందాలని సూచించారు. వరికి బదులు ఇతర ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలన్నారు. అయిల్ ఫాం వైపు రైతులు ఆలోచించాలని మంత్రి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
వీరనారి చాకలి ఐలమ్మకు ఘన నివాళులు
నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే ఆటో షోకు విశేష స్పందన
Mahatma Gandhi University | ఎంసీఏ, ఎంబీఏ పరీక్షలు వాయిదా