సంగారెడ్డి : భారత జాతీయోద్యమ స్ఫూర్తితో, అహింసా మార్గంలో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని సంగారెడ్డిలోని పోలీసు పరేడ్ గ్రౌండ్లో హోం మంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలను తెలంగాణ ప్రభుత్వం అందజేస్తుందన్నారు. సంగారెడ్డి మెడికల్ కాలేజీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే 150 మందితో తరగతులు స్టార్ట్ అవుతాయని మంత్రి తెలిపారు.
జిల్లాలో కొత్తగా 41,981 మందికి ఈ రోజు నుంచి ఆసరా పెన్షన్లు వస్తాయని మంత్రి పేర్కొన్నారు. అంతకుముందు స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రాణాలు ఆర్పించిన త్యాగధనులకు నివాళులు అర్పించారు.