సంగారెడ్డి : పార్కుల అభివృద్ధికి కృషి చేస్తామని పఠాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి అన్నారు. ఆర్సీపురం డివిజన్లోని సాయి నగర్ కాలనీలో రూ.1.40కోట్లతో పార్కు అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్ పుష్పతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో థీమ్ పార్కులను అభివృద్ధి చేస్తుందని తెలిపారు.
పట్టణ ప్రజలకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంత్రి హరీశ్ రావు ఇచ్చిన మాట ప్రకారం కాలనీ వాసుల కోసం సాయినగర్ కాలనీలో థీమ్ పార్కు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వారితో తొంట అంజయ్య, ఆదర్శ్ రెడ్డి, శంకర్ యాదవ్, మహేందర్ రెడ్డి, విట్టల్ రెడ్డి తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనాతో మేడారం పూజారి సమ్మారావు మృతి
ఆకతాయిలను ఐసోలేషన్కు పంపించిన పోలీసులు
అడవి శ్రీరాంపూర్లో కరోనాతో భార్యాభర్తలు మృతి
రైతులకు పనిముట్లను అందజేసిన మంత్రి అల్లోల
లాక్ డౌన్ కేసులు 11,746 : ఎస్పీ వెంకటేశ్వర్లు
మేడారం పూజారి మృతిపట్ల మంత్రి సత్యవతి సంతాపం