మహబూబాబాద్ : జిల్లాలో విద్యుత్ షాక్తో ముగ్గురు మృతి చెందడం పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విచారం వ్యక్తం చేశారు. డోర్నకల్ మండలం అందనాలపాడు గ్రామంలో రామాలయం గుడికి మైకులు కడుతుండగా విద్యుత్ షాక్ కు గురై ముగ్గురు మృతి చెందారు.
దేవుడి కార్యానికి చేస్తున్న ఓ మంచి పని సందర్భంలో ఇంతటి విషాదం చోటు చేసుకోవడం పట్ల ఆయన ఆవేదన చెందారు. మృతుల కుటుంబాలను తన ప్రగాఢ సంతాపాన్నితెలిపారు. ప్రభుత్వ పరంగా ఆ కుటుంబాలకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. కాగా, వర్షాకాలం వచ్చినందున, విద్యుత్ సంబంధ పనుల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.