సిద్దిపేట : మీకు ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం కేసీఆర్ కాంట్రాక్టు లెక్చరర్లను త్వరలోనే రెగ్యులరైజ్ చేస్తారని మంత్రి హరీశ్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్ఎస్ ఫంక్షన్ హాల్లో ఆదివారం రాష్ట్ర కాంట్రాక్టు లెక్చరర్స్ ఐకాస ఆధ్వర్యంలో.. పీఆర్సీ అమలు పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభకు మంత్రి హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ కాంట్రాక్టు లెక్చరర్లకు బేసిక్ పే ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించారన్నారు. గత ప్రభుత్వాలు కళాశాలలు మంజూరు చేసి పోస్టులను మరిచాయన్నారు.
సీఎం కేసీఆర్ ఇంటర్మీడియట్ లో ఉచిత విద్యను ప్రవేశ పెట్టారని పేర్కొన్నారు. ప్రభుత్వ లెక్చరర్లతో సమానంగా కాంట్రాక్టు లెక్చరర్లకు పీఆర్సీతో సమానంగా వేతనాలు ఇస్తున్నామని తెలిపారు. ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ ఉద్యోగులుగా ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. అలాగే మొదటి వారంలోనే కాంట్రాక్టు లెక్చరర్లకు వేతనాలు అందేలా చూస్తామన్నారు. కరోనాతో మృతి చెందిన కాంట్రాక్టు లెక్చరర్లకు సాయం అందిస్తామని మంత్రి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ద్విచక్ర వాహనాలు దొంగలిస్తున్న ముఠా అరెస్ట్
ఎల్లో బికినీలో కియారా రచ్చ..!
ఉద్యమంలా పట్టణ ప్రగతి : ఎమ్మెల్యే ఆరూరి
బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్
పల్లెప్రగతితో మారిన జీవన పరిస్థితులు : మంత్రి ఎర్రబెల్లి