మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం తిరుమలగిరి తండాలో బాలికపై లైంగిక దాడి, హత్యకు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. గ్రామ పరిధిలోని కెస్యనాయక్ తండాలో పదవ తరగతి విద్యార్థినిపై కొందరు వ్యక్తులు లైంగిక దాడి, హత్యకు పాల్పడ్డ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బాదేపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్ధిని మృతదేహాన్ని సందర్శించారు.
అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అత్యాచార ఘటన బాధాకరమని , నిందితులు ఎవరైనా సరే శిక్షించాలని పోలీస్ శాఖను ఆదేశించారు. నిందితులకు త్వరగా శిక్ష పడేలా ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్నారు.