మహబూబ్నగర్ : జిల్లాలోని ఉద్యాన రైతులను ఎగుమతుల దిశగా ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు తెలిపారు. గురువారం అయన బాలానగర్ మండలం చిన్న రేవల్లి గ్రామ సమీపంలో ఉన్న ఆన్స్ ఆగ్రానమి పండ్లు, కూరగాయల ఎగుమతుల ప్రాసెసింగ్ యూనిట్ ను పరిశీలించారు. జిల్లాలో బాలానగర్, రాజాపూర్, నవాబుపేట్, మిడ్జిల్, జడ్చర్ల, హన్వాడ మండలాలలో రైతులు ఎక్కువగా పండ్లు, కూరగాయలు పండిస్తున్నారని.. మంచి నాణ్యమైన పండ్లు, కూరగాయలను, ఎగుమతి చేసే ఉత్పత్తులను పండిస్తున్నారని తెలిపారు.
2018 నుంచి బాలానగర్ మండలం చిన్న రేవల్లి వద్ద ఔత్సాహిక పారిశ్రామికవేత్త ఆనంద్ సాగర్ పండ్లు, కూరగాయల ఎక్స్ఫోర్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ను నెలకొల్పి 5 దేశాలకు పండ్లు, కూరగాయలను ఎగుమతి చేస్తున్నందుకు అభినందించారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడంలో భాగంగా జిల్లా యంత్రాంగం తరఫున ఉద్యాన శాఖ ద్వారా ఆనంద్ సాగర్ కు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తామని తెలిపారు.
అదేవిధంగా నాబార్డు ద్వారా ఇక్కడి రైతులను విదేశాలకు పండ్లను, కూరగాయలను ఎగుమతులు చేసేవిధంగా ఎలా అనుసంధానం చేయాలో అధ్యయనం చేయాలని నాబార్డు ఏజీఎంను కోరినట్లు ఆయన చెప్పారు. ఈ విషయంలో ఉద్యాన శాఖ డైరెక్టర్ సైతం రెండుసార్లు ఈ ప్రాంతానికి వచ్చి పరిశీలించారన్నారు.
జిల్లా నుంచి పెద్ద ఎత్తున పండ్లు, కూరగాయలు ఎగుమతి చేస్తే రైతులకు పెద్ద మొత్తంలో లాభం రావడమే కాకుండా, విదేశీ మారక ద్రవ్యం కూడా వస్తుందని ఆయన తెలిపారు. ఇప్పటికే ఆగ్రోనమి ఎక్స్ఫోర్ట్ యూనిట్ ద్వారా 5, 6 రకాల మామిడి పండ్లను విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
కలెక్టర్ వెంట జిల్లా ఉద్యాన శాఖ ఉప సంచాలకులు సాయిబాబా, నాబార్డ్ ఏజీఎం శ్రీనివాస్, డీడీఎం నాగార్జున, ఆన్స్ ఆగ్రోనమి ఎక్స్ఫోర్ట్ యూనిట్ యజమాని ఆనంద్ సాగర్, విశ్రాంత తహసీల్దార్ జగన్నాథం, ఉద్యాన శాఖ అధికారులు , బాలనగర్ తాసిల్దార్ రవీంద్రనాథ్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
చిన్నారి గుండెకు అండగా ఎమ్మెల్యే మర్రి
ప్రజా సేవలో పోలీసులు అంకితం కావాలి
మెడికల్ హబ్గా మహబూబాబాద్ : మంత్రి సత్యవతి
వరద నీటిని సద్వినియోగం చేసుకోవాలి
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి : మంత్రి పువ్వాడ