నారాయణపేట : వరద ఉన్నప్పుడే జూరాల పై ఆధారపడిన ప్రాజెక్టులను నింపి రైతులకు ఇలాంటి ఇబ్బంది లేకుండా సాగునీరు అందించాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. జిల్లాలోని మఖ్తల్ భీమా ఫేస్ 2 పంప్ హౌస్ నుంచి చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు నీటి పంపింగ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది ముందస్తుగా వరద రావడం అత్యంత ఆశాజనకంగా ఉందని ఆయన తెలిపారు.
రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇంజిర్ శివ ధర్మతేజ, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గుప్తా, పసుపుల దత్తు, శేఖర్ రెడ్డి, అధికార ప్రతినిధి రామలింగం, కె. నేతాజీ రెడ్డి, జి.ఈశ్వర్ యాదవ్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
చిన్నారి గుండెకు అండగా ఎమ్మెల్యే మర్రి
ప్రజా సేవలో పోలీసులు అంకితం కావాలి
మెడికల్ హబ్గా మహబూబాబాద్ : మంత్రి సత్యవతి