హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్షగట్టి రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెడుతున్నదని, తమ కార్యకర్తలను వేధిస్తే ఊరుకోబోమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. కేసులకు వ్యతిరేకంగా కొట్లాడేందుకు పార్టీ పరంగా లీగల్ టీమ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో నిజాలను ప్రచారం చేసినా, ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపినా కాంగ్రెస్ సర్కార్ సహించడం లేదని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎన్ని విమర్శలు చేసినా ఈ రకంగా వ్యవహరించలేదని గుర్తుచేశారు. సోమవారం కోరుట్ల నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో హైదరాబాద్లోని తన నివాసంలో భేటీ అయ్యారు. జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి, మంత్రులు అదే పనిగా పోటీపడి తిట్లు తిడుతున్నారని, కేసీఆర్ పాలనలో నిధులు వరదలై పారితే ఇప్పుడు రాష్ట్రంలో తిట్లు పారుతున్నాయని ఎద్దేవాచేశారు. ‘కేసీఆర్ మొక అని రేవంత్రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదం. కేసీఆర్ మొక కాదు.. ఒక వేగుచుక. రేవంత్రెడ్డి గురువులకే చుకలు చూపించి తెలంగాణను సాధించిన శక్తి కేసీఆర్’ అని తేల్చిచెప్పారు. తెలంగాణ ఉద్యమం నుంచీ బీఆర్ఎస్ కార్యకర్తలు ఎన్నో కష్టాలకోర్చి పనిచేసిన చరిత్ర అని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా బీఆర్ఎస్ తట్టుకొని నిలబడిందని వివరించారు. ఇప్పుడూ అదే స్ఫూర్తితో పనిచేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలను, హామీలను విస్మరించిన తీరును ప్రజల్లో ఎండగట్టాలని దిశానిర్దేశం చేశారు.
చేనేతపై పన్ను బ్రిటీష్ పాలనలో కూడా లేదని, అలాంటిది ప్రధాని మోదీ జీఎస్టీ విధించడం దౌర్భాగ్యమని కవిత మండిపడ్డారు. సోమవారం ఆమెను తన నివాసంలో అఖిల భారత పద్మశాలి సంఘం నాయకులు కలిశారు. కులగణనపై బీసీ డెడికేటెడ్ కమిషన్కు నివేదిక అందించినందుకు కవితకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేనేతపై జీఎస్టీని రీయింబర్స్ చేస్తామని రాహుల్గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ హామీని విస్మరించడం శోచనీయమని వాపోయారు.
తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చేనేతపై కేంద్రం విధిస్తున్న జీఎస్టీని రీయింబర్స్ చేయాలని డిమాండ్ చేశారు. అఖిల భారత పద్మశాలి సంఘ జాతీయ అధ్యక్షుడు కందగట్ల స్వామి, అఖిలభారత పద్మశాలి సంఘం రాజకీయ జా తీయ అధ్యక్షుడు బొల్లా శివశంకర్, తెలంగాణ పద్మశాలి సంఘం మహిళా అధ్యక్షురాలు గుం టక రూపక, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సం ఘం ఉపాధ్యక్షుడు గుర్రం శ్రవణ్, తెలంగాణ పద్మశాలి సంఘ రాజకీయ విభాగ ప్రధాన కార్యదర్శి బొమ్మ ప్రవళిక, రాష్ట్ర కార్యదర్శి జిల్లా నరేందర్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు చిట్టిపోలు గణేశ్, రాష్ట్ర పద్మశాలి సంఘం యూత్ అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్ పాల్గొన్నారు.