వనపర్తి : జల సంపదతో పాటు మత్స్య సంపదను పెంచుతామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి నియోజకవర్గంలోని వెల్టూరు గోపాల సముద్రం, పెబ్బేరు మహా భూపాల సముద్రం, జానంపేట రామసముద్రం, శ్రీ రంగాపురం రంగసముద్రం, వనపర్తి నల్లచెరువు, గోపాల్ పేట కత్వ చెరువు, పొలికెపాడు మొగుళ్ల చెరువు, బుద్దారం పెద్ద చెరువులలో 5.50 లక్షల చేప పిల్లల విడుదల చేసి మాట్లాడారు.
చెరువులు, కుంటలే మత్స్యకారులకు జీవనాధారం. గత నాలుగేళ్లుగా తెలంగాణలో చెరువులు, కుంటలలో ఉచిత చేప పిల్లలు వేస్తున్నామని తెలిపారు. ఉచిత చేప పిల్లల పంపిణీతో మత్స్యకార కుటుంబాలకు భరోసాగా ఉంటుందన్నారు. మత్స్యసంపద రాకతో పేద వర్గాలకు అందుబాటులో బలవర్ధకమైన ఆహారం లభిస్తుందన్నారు.
ప్రభుత్వ ఉచిత చేప పిల్లల పంపిణీతో మత్స్యకార కుటుంబాల పరిస్థితి మారిందన్నారు. అన్నివర్గాల ప్రజలు ఆర్థిక స్థిరత్వం సాధించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అన్నారు. దేశంలోనే మంచినీటి చేపలలో తెలంగాణ నంబర్ వన్గా ఉందన్నారు. కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలతో వ్యవసాయరంగం బలోపేతమవుతున్నది
కేవలం ఏడేళ్లలో తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా నిలిచిం.యాసంగి నుంచి దొడ్డు వడ్లను సాగు చేయొద్దని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎఫ్సీఐ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రైతులు వరి సాగును తగ్గించి పంటల మార్పిడి మీద దృష్టి సారించాలన్నారు. అంతకుముందు వెల్టూరులో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు.
ఇవి కూడా చదవండి..
పరువు నష్టం కేసులో నటి కంగనాకు చుక్కెదురు
Nizamabad : పైకి తేలిన అంతరాష్ట్ర రహదారి
నేషనల్ హైవేపై దిగిన సుఖోయ్, జాగ్వార్ యుద్ధ విమానాలు.. వీడియో