అమరావతి : ఏపీలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ( Nara Lokesh ) తన పదవికి రాజీనామా ( Resign ) చేయాలని వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని( Perni Nani ) డిమాండ్ చేశారు. బుధవారం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలతో మంత్రి చెలగాటమాడుతున్నారని ఆరోపించారు.
విద్యార్థులకు చెల్లించాల్సిన రియింబర్స్మెంట్ను తక్షణమే విడుదల చేయాలని కోరారు. 2025 డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించి బాధ్యులను శిక్షించాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. క్రీడాపోటీల్లో పాల్గొన్న అనుకూల వ్యక్తులకు ఉద్యోగ అవకాశం కల్పించారని ఆరోపించారు.
ఈనెల 31న విద్యారంగ సమస్యలపై ఏపీలోని అన్ని జిల్లా కేంద్రాల్లో వైసీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువకులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు అన్ని నియోజకవర్గాల్లో రిలే దీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఆగస్టు 10న ర్యాలీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. నిరుద్యోగ భృతి నెలకు రూ.3వేలు బకాయిలతో కలిసి చెల్లించాలని డిమాండ్ చేశారు.