మహబూబ్నగర్టౌన్, ఆగస్టు 29 : మహబూబ్నగర్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, 8 ఏండ్లలో ఎంతో మార్పు చెందిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో నూతన ఆసరా పింఛన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహబూబ్నగర్ రూపురేఖలు మార్చాలన్న ఏకైక లక్ష్యంతోనే ముందుకెళ్తున్నట్లు తెలిపారు. మహబూబ్నగర్లో అత్యంత వెనుకబడిన ప్రాంతాలుగా పేరొందిన టీడీగుట్ట, వీరన్నపేటలో గతంలో ఎలాంటి సౌకర్యాలు ఉండేవి కాదని, ప్రస్తుతం వీరన్నపేటలో డబుల్బెడ్రూం ఇండ్లు కట్టించామని, టీడీగుట్ట వరకు బైపాస్ రహదారి నిర్మిస్తున్నామని తెలిపారు.
హన్వాడ వద్ద ఫుడ్ పార్క్ ఏర్పాటు చేసి పరిశ్రమలు నెలకొల్పుతున్నామన్నారు. త్వరలోనే పాతకలెక్టరేట్ స్థానంలో రూ.500 కోట్లతో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ తాటిగణేశ్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్, కౌన్సిలర్లు కోట్ల నర్సింహులు, మాధవీలత, మునీర్, నాయకులు శివరాజ్, చిన్న, శ్రీనివాస్,మార్కెట కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్రెడ్డి, అనంతయ్య,చిన్న, సత్యం యాదవ్,చెన్నయ్య లక్ష్మణ్నాయక్,తదితరులు పాల్గొన్నారు.