పెద్దపల్లి : గెలుపోటములతో సంబంధం లేకుండా మంథని నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బీఆర్ అంబేద్కర్(Dr. BR Ambedkar) అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని మంథనిలోని పాత పెట్రోల్ పంపు చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు(tribute) అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు ఎంతో గొప్పవన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు పోరాటం చేస్తామన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందన్నారు.