కౌడిపల్లి/మెదక్ : వచ్చే ఏడిదికల్లా కౌడిపల్లి మండలానికి కాళేశ్వర జలాలను తీసువచ్చి తాగు, సాగు నీరు శాశ్వత పరిష్కారం చూపిస్తామని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రూ.66లక్షలతో మండల పరిధిలోని మహ్మద్నగర్, తునికి గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలను ప్రారంభించారు.
అలాగే మండలంలోని ఆయా గిరిజన తండాల్లో నిర్మించిన సీసీ రోడ్లు రూ.3కోట్ల 70లక్షల పనులను ప్రారంభించారు. మహ్మద్నగర్ కొత్తరోడ్డు వద్ద పీఏసీఎస్ భవనం, గోదాం నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ను కలిసి ప్రత్యేకంగా కౌడిపల్లి ప్రాంతానికి కాళేశ్వరం నీళ్లు తీసుకరావడానికి కృషి చేస్తానన్నారు.
అలాగే మండలంలోని ప్రతి గిరిజన తండాకు సీసీ రోడ్లు వేశామన్నారు. రైతు వేదికలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహ్మద్నగర్, కన్నారం గ్రామాల్లో పూర్తి స్థాయిలో సీసీ రోడ్లు వేసేందుకు అధికారులు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
కార్యక్రమంలో లేబర్ బోర్డ్ చైర్పర్సన్ ఉమ్మన్నగారి దేవేందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రాగౌడ్, జిల్లా వ్యవసాయాధికారి పరశురాం నాయక్, డీసీసీబీ ఉమ్మడి మెదక్ జిల్లా డైరెక్టర్ బాన్సువాడ గోవర్ధన్రెడ్డి, ఆత్మకమిటీ చైర్మెన్ మల్లారెడ్డి, ఎంపీపీ రాజు, జడ్పీటీసీ కవిత, తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Crime news | ఒంటిపై పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్య
ఆందోళన వద్దు ప్రతి గింజను కొంటాం : మంత్రి నిరంజన్ రెడ్డి
Gutka packets | నిర్మల్లో భారీగా గుట్కా ప్యాకెట్ల పట్టివేత