Sonia Gandhi | ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీతో భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు సమావేశమయ్యారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మీడియా వివరాలను వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారిగా మర్యాదపూర్వకంగా పార్టీ అగ్రనేతను కలిసినట్లు తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచే పోటీ చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్ర పార్టీ నుంచి తీర్మానం చేసి పంపినట్లు సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.
రాష్ట్రంలో అమలు చేసిన, చేయబోతున్న గ్యారెంటీలను వివరించామన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకంలో గడిచిన రెండు నెలల్లో 15 కోట్ల జీరో టికెట్లు రికార్డయ్యినట్లు సోనియాకు తెలిపినట్లు చెప్పామని, త్వరలోనే మరో రెండు గ్యారెంటీలు అమలు చేయబోతున్నట్లు వివరించామన్నారు. 200యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గృహ అవసరాలకు గ్యాస్ సిలిండర్ అమలు చేయబోతున్నామన్నారు. రాష్ట్రంలో మొదటిసారి హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తున్నట్లు సోనియాగాంధీకి తెలిపామని, పథకాల అమలుపై అభినందించారని భట్టి విక్రమార్క వివరించారు.