మెదక్ : టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుటందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. రామాయంపేట మండలం ఝాన్సిలింగాపూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో మృతి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త నల్ల రాజయ్య కుటుంబానికి పార్టీ సభ్యత్వ ఇన్సూరెన్సు రూ.2లక్షల చెక్కును మృతుడి భార్య ఎల్లవ్వకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీఆర్ఎస్ కార్యకర్తలకు అన్ని విధాల అండగా ఉంటుందన్నారు.
ఏ ఆపద వచ్చినా ముందుండి కార్య కర్తలకు న్యాయం చేస్తామన్నారు.
మృతుడు నల్ల రాజయ్యకు రైతుబంధు కూడా వర్తిస్తుందన్నారు. కార్యక్రమంలో రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం, రైతు బంధు మండల అధ్యక్షుడు నర్సారెడ్డి, ఝాన్సిలింగాపూర్ సర్పంచ్ పంబాల జ్యోతి, ఎంపీటీసీ జ్యోతి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
యాదాద్రి ఆలయం అత్యద్భుతం : ఏపీ మంత్రి పేర్ని నాని
విమర్శల పాలవుతున్న ప్రగ్యా ఠాకూర్.. ఎందుకంటే.?
పేదలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం
సానియా మీర్జా, షోయెబ్ జంటకు యూఏఈ గోల్డెన్ వీసా జారీ