స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం రాత్రి సెక్రటేరియట్ సందర్శనకు పెద్ద ఎత్తున జనాలు తరలిరావడంతో సచివాలయం ఎదుట భారీగా వాహనాల రద్దీ ఏర్పడింది. ఆ రోడ్డు మార్గంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలు కిలోమీటరు వరకు నిలిచిపోయాయి. కార్లు, ద్విచక్రవాహనాలు, ఆటోలు పెద్ద సంఖ్యలో నిలిచిపోవడంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నారు.