హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ పరిధిలో ఉన్న వ్యాధికి కొనసాగింపుగా అందించే చికిత్సకు 24 గంటల హాస్పిటల్ అడ్మిషన్ లేదన్న కారణంతో బీమా క్లెయిమ్ను తిరసరించ లేరని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. దవాఖానలో అడ్మిట్ కావడం చికిత్స అందించే విధానాల్లో ఒకటేనని, చికిత్స స్వభావం, అది పాలసీలో కవర్ చేసిన వ్యాధికి సంబంధించినదా, వైద్యపరంగా అవసరమైనదా, పాలసీలో స్పష్టమైన మినహాయింపు ఉందా అనే అంశాలను పరిశీలించాల్సి ఉంటుందని జస్టిస్ సూరజ్ గోవిందరాజ్ పేరొన్నారు. అయితే ఈ తీర్పుతో ప్రతి ఓపీ చికిత్సకు ఆటోమేటిక్గా హెల్త్ ఇన్సూరెన్స్ వర్తిస్తుందని భావించ రాదని కోర్టు స్పష్టం చేసింది.
ఈ కేసులో స్టేజ్-4 ప్రోస్టేట్ క్యాన్సర్తో బాధపడుతున్న పద్మనాభ శెట్టి, డాక్టర్ల సూచన మేరకు తీసుకున్న జోలాడెక్స్, ఎక్స్జ్వా ఇంజెక్షన్ల కోసం రూ.2,85,470 ఖర్చు చేశారు. ఇతర క్యాన్సర్ చికిత్సల ఖర్చులను నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించినప్పటికీ, ఈ రెండు ఇంజెక్షన్ల ఖర్చును మాత్రం తిరసరించింది. పద్మనాభ శెట్టి దాఖలు చేసిన ఫిర్యాదుపై మంగళూరు పర్మనెంట్ లోక్ అదాలత్ రూ.2,85,470ను 6 శాతం వడ్డీతోపాటు రూ.25,000 పరిహారంగా చెల్లించాలని ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ రిట్ పిటిషన్ను కొట్టివేసి, రూ.2,85,470ను తాజా వడ్డీతో పాటు అదనంగా రూ.50,000 ఖర్చులను 30 రోజుల్లో పద్మనాభ శెట్టికి చెల్లించాలని ఆదేశించింది.