యాదాద్రి భువనగిరి : యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం అత్యద్భుతమని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు. శుక్రవారం యాదాద్రి లక్ష్మీ నర్సింహ స్వామిని మంత్రి దర్శించుకుని ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..స్వామి వారి ఆలయాన్ని చాలా చిత్తశుద్ధితో పూర్తి సాంప్రదాయంగా, ప్రపంచవ్యాప్తంగా భక్తులకు నచ్చేలా నిర్మించడం చాలా గొప్ప విషయమన్నారు. తిరుపతి ఆలయాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించడం ప్రస్తుతం చరిత్రగా చెప్పుకుంటున్నారని.. భవిష్యత్తులో యాదాద్రి ఆలయాన్ని కేసీఆర్ నిర్మించారని చెప్పుకుంటారని పేర్కొన్నారు. దేవుడి ఆశీస్సులతో సీఎం కేసీఆర్ సంకల్పం తప్పకుండా నెరవేరుతుందని మంత్రి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
విమర్శల పాలవుతున్న ప్రగ్యా ఠాకూర్.. ఎందుకంటే.?
పేదలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం
సానియా మీర్జా, షోయెబ్ జంటకు యూఏఈ గోల్డెన్ వీసా జారీ