మహబూబ్ నగర్ : ప్రభుత్వ జనరల్ దవాఖానలో త్వరలో ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇదివరకే ఆక్సిజన్ ప్లాంట్ ఉన్నప్పటికీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జిల్లాలోనే ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ను కూడా నెలకొల్పాలని నిర్ణయించాం. త్వరలోనే హై టెక్నాలజీతో కూడిన, నిమిషానికి వెయ్యి లీటర్ల ఆక్సిజన్ ను ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.
శనివారం మంత్రి ప్రభుత్వ జనరల్ దవాఖానను ఆకస్మికంగా సందర్శించారు.
ముందుగా మంత్రి శాంత నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా రోగుల సహాయకులు, పారిశుధ్య కార్మికులకు మధ్యాహ్న భోజనాన్ని పంపిణీ చేశారు.
అనంతరం జనరల్ హాస్పిటల్ కి వచ్చే రోగుల సహాయకులు కూర్చునేందుకు వీలుగా నిర్మించనున్న షెడ్డును పరిశీలించి ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. కరోనా పరీక్షలు నిర్వహించే విభాగాన్ని తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కరోనా వార్డు ముందు ఉన్న కరోనా రోగులతో కూడా మంత్రి మాట్లాడి వారికి మనో ధైర్యాన్ని కల్పించారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ కిషన్, మున్సిపల్ చైర్మన్ కె.సి నర్సింహులు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కృష్ణ , డాక్టర్ జీవన్, టీఎస్ఎంఐడడీసీ ఈఈ శరత్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
ఆక్సిజన్ ప్రాముఖ్యం వెలకట్టలేనిది : మంత్రి శ్రీనివాస్ గౌడ్
కరోనాతో కొల్లాపూర్ తహసీల్దార్ మృతి
అంకిరెడ్డిపల్లిలో బ్లాక్ ఫంగస్తో వ్యక్తి మృతి
రేపటి నుంచి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు వ్యాక్సినేషన్
కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న మంత్రి సత్యవతి