Minister Errabelli | పాలకుర్తి : సీఎం కేసీఆర్ మనసున్న మహారాజు అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మానవీయ కోణంలో ఆయన పరిపాలన కొనసాగిస్తున్నారని.. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వివోఏలకు గౌరవ వేతనాలు ఇస్తున్నారని.. ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు.. ఇలా అందరికీ వేతనాలు పెంచారని గుర్తు చేశారు. ఇటీవల వివోఏలకు గౌరవ వేతనాలు పెంచిన నేపథ్యంలో పాలకుర్తి క్యాంప్ కార్యాలయంలో సీఎం కేసీఆర్ కు ఆత్మీయ కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. మహిళలు ఆత్మగౌరవంతో బతికే విధంగా చర్యలు తీసుకుంటున్న సీఎం కేసీఆర్కు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆయన రుణం తీర్చుకోవాలని అన్నారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా సీఎం కేసీఆర్ మహిళల అభివృద్ధికి, వారి సాధికారతకు పెద్దపీట వేస్తూ అనేక పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. బీఆర్ఎస్ పరిపాలనలోనే రాష్ట్రంలోని మహిళలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని తెలిపారు. చాలాకాలంగా ఎదురుచూస్తున్న వివోఏ ల గౌరవ వేతనాలను పెంచి, కేసీఆర్ మహిళల పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారని అన్నారు. ఆయన రుణం తీర్చుకోలేనిదని.. ఆయనకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ సభలో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వివోఏలు, స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.