మెదక్ : రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాంరైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియా కాన్ఫరెన్స్ హాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ హరీశ్తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎఫ్సీఐ ధాన్యాన్ని కొనకపోయిన సీఎం కేసీఆర్ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే కొనుగోలు చేసేలా ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. రైతుల సంక్షేమం కోసం రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు ఇవ్వడం, మిషన్కాకతీయ, కాళేశ్వరం ద్వారా చెరువులు నింపి సాగునీరందించారని పేర్కొన్నారు.
ప్రతి ధాన్యపు గింజను మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆమె తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చే ముందు ధాన్యాన్ని తాళ్లు లేకుండా 17 శాతం తేమ శాతం మించకుండా తీసుకురావాలని రైతులకు సూచించారు. రైతులు దళారీలను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు.