మేడ్చల్ మల్కాజిరిగి : రైతులు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. ఘట్కేసర్ మండలం అవుషాపూర్ గ్రామంలోని వరి పొలాలను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రైతులను రాజును చేయటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు.
ఈ నెల 16 నుంచి రాష్ట్రంలోని అన్ని చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుకు అండగా ఉంటూ ఆదుకుంటున్నట్లు చెప్పారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి చేరికలు
రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలి
మత్స్యగిరి దేవస్థానం అభివృద్ధికి కృషి : మంత్రి మల్లారెడ్డి
నిరాడంబరంగా ఉగాది వేడుకలు: మంత్రి అల్లోల
భద్రాద్రి రాములోరి కళ్యాణానికి రండి..