హైదరాబాద్ : సీఎం కేసీఆర్ మీద బీజేపీ నేతలు అభాండాలు వేస్తున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ మండిపడ్డారు. మంగళవారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో బీజేపీ నేతల తీరుపై నిప్పులు చెరిగారు.
ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ..బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని అభివృద్ధి, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. చర్చకు మేం రెడీ. రవీంద్రభారతికి రండి తేల్చుకుందామని బీజేపీకి సవాల్ విసిరారు.
తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవు. కేంద్ర ప్రభుత్వ అధికారులను అడగండి మా అభివృద్ధి ఎలా ఉందో చెపుతారన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ ఎస్ మీటింగ్ వస్తే బండి సంజయ్ అరెస్ట్ అయితే వచ్చారని ప్రచారం చేస్తున్నారు. బీజేపీని తెలంగాణ ప్రజలు నమ్మరని తెలిపారు. బీజేపీ పాలిత ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తున్నాం.
నాలుగు హెలికాప్టర్ లు పెడుతాం. తెలంగాణ అంతా చూసి వచ్చాక అప్పుడు మాట్లాడండని హితవు పలికారు. బీజేపీ తప్పుడు ప్రచారాలు చేసి తెలంగాణలో గెలిచింది. తెలంగాణ ప్రభుత్వంపై..సీఎం కేసీఆర్ పై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదన్నారు.
దేశ భక్తి బీజేపీ పేటెంట్ కాదు. రాముని టెంపుల్ కడుతామని చెప్పి ఓట్లు దండుకున్నారు.
మేం ప్రచారం చేయలేదు. కానీ, యాదాద్రిని పునర్నిర్మించామని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ సామాన్య ప్రజల వ్యతిరేక పార్టీ అని వినోద్కుమార్ విమర్శించారు.