మా సమస్యలను సీఎం కేసీఆరే పరిష్కరిస్తారు
ఎంపీటీసీల సంఘం రాష్ట్రఅధ్యక్షుడు కుమార్గౌడ్
హన్మకొండ, జూలై 31: హుజూరాబాద్ ఉపఎన్నికలోతమ సంఘం తరఫున ఎవరూ పోటీ చేయట్లేదని తెలంగాణ ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడీల కుమార్గౌడ్ స్పష్టంచేశారు. శనివారం హన్మకొండలో మీడియాతో మాట్లాడారు. పార్టీలకతీతంగా తమ హక్కులు, సమస్యల పరిష్కారం కోసం మాత్రమే పోరాటం చేస్తాం తప్ప రాజకీయం చేయట్లేదన్నారు. ఉప ఎన్నికలో పోటీ చేస్తామని ప్రకటించిన వాసుదేవరెడ్డికి తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. సొంత ప్రయోజనాల కోసం కొందరు అలా మాట్లాడుతున్నారని విమర్శించారు. గత రెండు, మూడేళ్లుగా తమ సమస్యలను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, కేటీఆర్, హరీశ్రావుతోపాటు ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో సీఎం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్న క్రమంలో కొందరు ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందె యాకయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దివి రవీందర్, తంగడి నగేశ్ తదితరులు పాల్గొన్నారు.