హైదరాబాద్, మే 1(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగరంలో రోజుకు 15 వేల ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నట్టు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్వయంగా అంగీకరించారు. ఈ విషయం రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర మంచినీటి ఎద్దడికి సాక్ష్యంగా నిలుస్తున్నది. ఒక్క హైదరాబాద్లోనే రోజుకు 14 గంటలు ఫిల్లింగ్ చేస్తూ 15 వేల వాటర్ ట్యాంకర్లతో నీటిని అందిస్తుంటే, రానున్న రోజుల్లో మరింత నీటి ఎద్దడి తలెత్తనున్నట్టు స్పష్టమవుతున్నది. తాజా నీటి పరిస్థితిపై శుక్రవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఎండలు, వడగాడ్పుల నుంచి ప్రజలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. ఇందుకు సంబంధిత శాఖలు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈసారి ఎండలు, వడగాడ్పులు అధికంగా ఉన్న నేపథ్యంలో ‘హీట్వేవ్ యాక్షన్ ప్లాన్’ అమలుచేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా విపత్తుల నిర్వహణశాఖ, ఇండియన్ మెట్రలాజికల్ శాఖలు సంయుక్తంగా రూపొందించిన ‘హీట్వేవ్ యాక్షన్ ప్లాన్’ విడుదల చేశారు.