న్యూఢిల్లీ: భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తన ఖాతాదారులకు తీపి కబురందించింది. వృద్ధుల కోసం అందుబాటులోకి తెచ్చిన స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్.. ఎస్బీఐ వీకేర్ రిటైల్ టర్మ్ డిపాజిట్ గడువును వచ్చే జూన్ 30వ తేదీ వరకు పొడిగించింది. కరోనా వైరస్ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని వృద్ధుల కోసం గతేడాది మేలో ప్రత్యేకంగా టర్మ్ డిపాజిట్ స్కీమ్ను ఎస్బీఐ తెచ్చింది.
తొలుత సెప్టెంబర్ వరకు గడువు పెట్టినా.. తర్వాత డిసెంబర్ వరకు, మూడోసారి 2021 మార్చి 31 వరకు మరోసారి పొడిగించింది. బుధవారంతో ఆ గడువు ముగుస్తుండటంతో మరోసారి మూడు నెలలు గడువు పొడిగించింది.
కనుక సీనియర్ సిటిజన్లు ‘ఎస్బీఐ వీకేర్’ స్కీమ్లో డిపాజిట్ చేయడానికి మరో మూడు నెలలు సమయం లభిచింది. ఎస్బీఐ వీకేర్ ఒక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్. సాధారణంగా బ్యాంకుల్లో వృద్ధులు చేసే ఫిక్స్డ్ డిపాజిట్లకు వడ్డీ రేట్లు వేరుగా ఉంటాయి.
దీనిలో చేరితే సాధారణ వడ్డీ రేట్ల కన్నా వృద్ధులకు 80 బేసిస్ పాయింట్లు (0.8 శాతం) వడ్డీ ఎక్కువ లభిస్తుంది. ప్రస్తుతం సాధారణ ప్రజలు ఐదేళ్లకు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 5.40 శాతం వడ్డీ అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 5-10 ఏండ్ల కాలానికి డిపాజిట్ మొత్తంపై 6.20 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
‘ఎస్బీఐ వీకేర్ డిపాజిట్’ స్కీమ్లో చేరాలంటే వయస్సు 60 ఏళ్ల పైనే ఉండాలి. భార్యాభర్తలు సింగిల్ అకౌంట్ /జాయింట్ అకౌంట్ ప్రారంభించొచ్చు. నామినేషన్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది.
ఈ స్కీమ్లో కనీసం రూ.1,000 నుంచి గరిష్టంగా రూ.15 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. తొలుత ఐదేండ్లకు డిపాజిట్ చేసి, తర్వాత మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు. ఐదేండ్ల కన్నా ముందే డబ్బులు విత్డ్రా చేస్తే 0.30 శాతం వడ్డీ నష్టపోవాల్సిందే. ఈ స్కీమ్ ద్వారా వచ్చే వడ్డీపై ఎలాంటి ఆదాయం పన్ను మినహాయింపులు ఉండవు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
టెస్లాకు షాక్: విద్యుత్ వాహన రంగంలోకి షియోమీ
బంపరాఫర్: సర్కారీ ఉద్యోగులకు లక్ష ఎలక్ట్రిక్ టూ వీలర్స్
రన్నింగ్ బస్సులోంచి వాంతులు.. లారీ ఢీకొట్టడంతో తెగిపోయిన బాలిక తల..!
మోదీ సభకు వెళ్తుండగా ప్రమాదం.. తమిళనాడు స్పీకర్కు గాయాలు
పున్నమి చంద్రుడే ఆ నౌకను కదిలించాడు.. !